Mane Praveen

May 07 2024, 08:36

NLG: లెంకలపల్లి: పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించిన భక్తులు
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు (పెద్దమ్మ తల్లి పండుగ)  సందర్భంగా సోమవారం సాయంత్రం గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

May 06 2024, 21:46

నాంపల్లి మండలం స్థాయి బూత్ కమిటీ సభ్యుల విస్తృతస్థాయి సమావేశం
నాంపల్లి: పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైంది. ప్రజలందరి దీవెనలతో ఇప్పుడు ప్రజా పాలన వచ్చింది. ఇప్పుడు ఆదర్శ తెలంగాణను తీర్చిదిద్దుకుందామని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఇంచార్జీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.నియంతృత్వ బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయడమే తన లక్ష్యమన్నారు.

సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో మండలం స్థాయి బూత్ కమిటీ సభ్యుల విస్తృతస్థాయి సమావేశం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేవారు అభివృద్ధిని చేయలేరన్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 

మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు, త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పేదల పార్టీ అని బీజేపీ, బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలను నమ్మవద్దని  భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని తనను ఆదరించినట్లే అతనిని కూడా ఆదరించాలని అన్నారు. నాంపల్లి మండలం నుండి భారీ మెజార్టీని తేవాలని అన్నారు.

నక్కలగండి పూర్తి చేసి కిష్ణరాంపల్లి, చర్లగూడెం, ప్రాజెక్టుల ద్వారా సాగు, త్రాగునీరు, మునుగోడు నియోజకవర్గ ప్రజలు అందించి సస్యశ్యామలం చేస్తామని అన్నారు. గత పది ఏళ్లలో బి ఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో దేశ చరిత్రలోనే గుర్తింపు ఉండేలాగా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కార్యకర్తలను కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలిచి తీరుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అన్నారు. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, ప్రతి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నారు. రైతుబంధు రాని వారికి ఈనెల 9 నుండి రైతుబంధు, అందుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో  పీసీసీ రాష్ట్ర కార్యనిర్వణ కార్యదర్శి పున్న కైలాస్, నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు  ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, గజ్జల శివారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, మేకల రమేష్ ముదిరాజ్, పానుగంటి వెంకన్న, విష్ణువర్ధన్ రెడ్డి, కొమ్ము బిక్షం, అంగిరేకుల పాండు, సుధనబోయిన శ్రీను యాదవ్, దండిగ అలివేలు నరసింహ, కోరే యాదయ్య, పోగుల దివ్య, అబ్బనబోయిన చంద్రమౌళి, బొల్లంపల్లి విష్ణుమూర్తి, మెగావత్ రవి నాయక్, మెగావత్ దీప్లా నాయక్, అన్నేపాక కిరణ్, సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి, దామర యాదగిరి, దొటి పరమేష్ యాదవ్, రేవల్లి సుధాకర్, గుండాల అంజయ్య, ఈద శేఖర్, మారేపాకుల కొండలు, దూదిమెట్ల యాదగిరి, సురేందర్ నాయక్ పానుగంటి వెంకటయ్య, గాదేపాక నాగరాజు, వడ్డేపల్లి సైదులు, కలకొండ దుర్గయ్య, జమ్లా నాయక్, కామిశెట్టి చత్రపతి, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 06 2024, 16:04

NLG: ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ D లైసెన్స్ కోచ్ కోర్సు కొరకు సదుపాయాల పరిశీలన
ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ విజన్ 2047  ప్రకారం భారతదేశం లో 10లక్షల మంది ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో గ్రాస్ రూట్ లో ప్రొఫెషనల్ ఫుట్బాల్ కోచ్ లను తయారు చేయాలనే కార్యాచరణలో భాగంగా,   తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సారథ్యంలో మే నెల చివరి వారంలో 7 రోజులపాటు  *D లైసెన్స్ కోచ్ కోర్సు* ను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయుటకు భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఉన్న సదుపాయాలను తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి GP ఫల్గుణ ఆధ్వర్యంలో ఈరోజు పరిశీలించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని 24 మంది ఈ కోర్సు ను  పూర్తి చేయడానికి గాను ఫుట్బాల్ గ్రౌండ్,సెమినార్ హాల్, డైనింగ్ హాల్, డిజిటల్ క్లాస్ రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్ తదితర సదుపాయాలకై పూర్తి పరిశీలన చేయడం జరిగింది.

ఈ సందర్భంగా TFA ప్రధాన కార్యదర్శి GP ఫల్గుణ మాట్లాడుతూ ఫుట్బాల్ క్రీడాకారులకు *D లైసెన్స్ కోర్స్* ను భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ హైస్కూల్ నందు ఏర్పాటు చేయడానికి యాజమాన్యంతో చర్చించడం జరిగిందని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడను ఎక్కువమంది నిరుపేద క్రీడాకారులు ఆడతారని వారికి తక్కువ ఫీజు తో ఈ కోర్సును పూర్తి చేయడానికి న్యూ డైమెన్షన్ స్కూల్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ TFA ఆధ్వర్యంలో *D లైసెన్స్ ప్రొఫెషనల్ కోచ్ ల కోర్స్* ను పప్రధమంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసే ప్రక్రియను TFA ప్రారంభించడం ఎంతో గర్వించదగ్గ విషయమని అది తెలంగాణ రాష్ట్రంలోని ఫుట్బాల్ క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ గడసంతుల మధుసూదన్ ఆధ్వర్యంలో  రాష్ట్ర సెక్రెటరీ GP ఫల్గుణ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు మరియు TFA అసోసియేట్ లను శాలువాతో ఘనంగా సన్మానించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి లడ్డు ప్రసాదాలను అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ మద్ది కర్ణాకర్, ఫుట్బాల్ కోచ్ ప్రభాకర్, బీసీ గురుకుల ఫిజికల్ డైరెక్టర్ గడసంతుల భాస్కర్,TFA టెక్నికల్ కోఆర్డినేటర్ జాయ్ సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 05 2024, 18:29

NLG: చండూరు లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం
చండూరు మండల కేంద్రంలో ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఉదయం అంతా తీవ్రమైన ఎండ గా ఉన్న వాతావరణం, సాయంత్రం సమయానికి ఒక్కసారిగా చల్లబడి ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడింది. మండుతున్న ఎండల నుండి కాస్త ఉపశమనం కలిగినట్లు అయ్యింది.

చండూరు మండల కేంద్రంలో ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఉదయం అంతా తీవ్రమైన ఎండ గా ఉన్న వాతావరణం, సాయంత్రం సమయానికి ఒక్కసారిగా చల్లబడి ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన

Mane Praveen

May 05 2024, 16:44

NLG: ముమ్మరంగా కొనసాగుతున్న చత్రపతి శివాజీ (CSL) ఫుట్బాల్ లీగ్స్.. ముఖ్య అతిథిగా పాల్గొన్న PRTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం

నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో క్రీడాకారుల లో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 11 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఈరోజు నిర్వహించిన మ్యాచ్ లో మాన్ ఫోర్ట్ ఫుట్బాల్ క్లబ్, చత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరా హోరీ మ్యాచ్ జరగగా 2-2 స్కోర్ నిర్ణీత సమయానికి రెండు జట్లు సమ స్కోర్టు తో నిలిచి మ్యాచ్ డ్రా గా ముగియడం జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసేలా ప్రతి ఆదివారం నాడు CSL ఫుట్బాల్ లీగ్ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా PRTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ రావడం, క్రీడాకారులతో ఎన్నో విషయాలపై చర్చించడం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలియజేశారు. 

సుంకరి బిక్షం గౌడ్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల దశ నుండే క్రీడల్లో పాల్గొనడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడా ఎంతో గొప్పదని, ప్రపంచంలో అత్యధిక దేశాలు ఆడే క్రీడ ఫుట్బాల్ అని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడల్లో రాణించాలంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయిలో రాయించిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని నిరంతరం సాధన చేయాలని అన్నారు.

నల్గొండ జిల్లాలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు చాలా గొప్పవని వ్యవస్థాపకులు బొమ్మ పాల గిరిబాబు ను ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ లను ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం క్రీడాకారులకు

 శ్రీసత్యం వర్మీ బయో ఆర్గానిక్స్ వారు అందజేసిన బిస్కెట్ ప్యాకెట్లు-సాఫ్ట్ డ్రింక్ లు పంపిణీ చేశారు. ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, వెంకటసాయి, యశ్వంత్, శివదాసు తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 05 2024, 14:22

TG: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

ఈ రోజు మేడ్చల్ జిల్లా,కీసర మండలం, చీర్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా సమృద్ధిగా వర్షాలు పడి, కరువు అంతమై, పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ బ్రహ్మోత్సవాలలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Mane Praveen

May 05 2024, 12:37

నామపురం గ్రామంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

మర్రిగూడ మండలం, నామపురం గ్రామంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ, ఇంటి ఇంటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నామాపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. 

Mane Praveen

May 04 2024, 21:15

NLG: రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

నాంపల్లి: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని బిఆర్ఎస్ ను పూర్తిగా బొంద పెట్టేంత వరకు నిద్రపోనని అన్నారు.

శనివారం నాంపల్లి మండల కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మండల కేంద్రంలోనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం సభ వేదిక నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఏళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడని బిడ్డే లిక్కర్ కేసులో అడ్డంగా దొరికి తీహార్ జైల్లో ఉందని, ఫోన్ టాపింగ్ అంశంపై మరో కేసు నడుస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో సిగ్గు లేకుండా కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని జనాల్లో తిరుగుతున్నాడో చెప్పాలని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

బూర నర్సయ్య గౌడు పాత బిఆర్ఎస్ పార్టీ బుద్ధులు కొత్త బిజెపి పార్టీలో చూపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ డాక్టర్ జేఏసీ తరఫున బూర నర్సయ్య గౌడ్ ను తీసుకురాకపోతే నేడు ఆయన ఎవరికి తెలుసు అని ప్రశ్నించారు.

కేసీఆర్ కు గతంలో అత్యంత సన్నితుడైన బుర్ర నర్సయ్య గౌడ్ భువనగిరికి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. 2014 విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఎయిమ్స్ వచ్చిందని, 5 ఏళ్లు ఎంపీగా ఉండి ఎయిమ్స్ ను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. బిజెపి నాటినుండి నేటి వరకు కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య వైశమ్యాలు సృష్టించి రాజకీయాలు చేస్తుందని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు దీన్ని గమనిస్తున్నారన్నారు. త్వరలోనే బిజెపికి ప్రజలు బుద్ధి చెప్పి కాంగ్రెస్ కు అధికారం కట్టబెడతారని ఆశించారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే పాటుపడే పార్టీ అన్నారు.

భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని మెజార్టీ ఎంత వస్తుందనే దానిమీదనే ఎదురుచూస్తున్నామన్నారు. అలాగే బోనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో కాంగ్రెస్ కు అత్యధిక మెజార్టీ ఇవ్వడంలో మునుగోడు నియోజక వర్గం పోటీ పడనున్నట్లు చెప్పారు. కిష్టరాంపల్లి, చర్లగూడెం, రిజర్వాయర్ పూర్తిచేసి మండల రైతన్నల పొలాల్లోకి కృష్ణా జలాలను అందిస్తామని తెలిపారు. రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.

ఆగస్టు 15 లోగా రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ప్రాజెక్టుల పేరుతో కమిషనర్లను దండుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మధు యాస్కిగౌడ్, పున్న కైలాష్, నాంపల్లి జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, గజ్జల శివారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, పానుగంటి వెంకటయ్య, పెద్దిరెడ్డి రాజు, చిలుకూరి బిక్షం, బట్టు జగన్ గిరి, అల్లంపల్లి ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 04 2024, 16:46

NLG: ఉచిత వేసవి ఫుట్బాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

 

NLG: జిల్లా యువజన మరియు క్రీడల శాఖ, యువత స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తానేదార్ పల్లి గ్రామంలో ఉచిత వేసవి ఫుట్బాల్ శిక్షణ శిబిరాన్ని గుర్రంపోడు ఎస్ఐ శివప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మారుమూల ప్రాంతమైన తానేదార్ పల్లి గ్రామంలో ఫుట్బాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం ఎంతో అభినందనీయమని, చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు కూడా ఉదయం సాయంత్రం శిక్షణ శిబిరంలో పాల్గొనాలని తద్వారా శారీరకదారుఢ్యం మంచి ఆరోగ్యం, పెంపొందుతున్నదని తెలిపారు. క్యాంపు నిర్వహకుడు ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ బొల్లు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..1 నెల రోజులపాటు తమ గ్రామ పంచాయతీలో నిర్వహించే ఫుట్బాల్ శిక్షణ శిబిరానికి సంపూర్ణ సహకారం అందిస్తానని, గ్రామం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు వెలుగులోకి రావడానికి క్రీడాకారులకు ఆర్థికపరమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, UPS చైర్మన్ మడ్డి యాదయ్య, ఖమ్మంపాటి నరసింహ, కుంభం కొండల్, గిరి శ్రీను, ఖమ్మంపాటి గణేష్, గార్లపాటి మల్లికార్జున్, మరిమహేష్, గిరిఅజయ్ కుమ్మరి ఆంజనేయులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Mane Praveen

May 04 2024, 14:46

నల్లగొండ పట్టణం 5 వ వార్డులో బిజెపి ఇంటింటికి ప్రచారం

నల్లగొండ: బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలిపించాలని బిజెపి నాయకులు గడ్డం మహేష్ ఆధ్వర్యంలో 5వ వార్డులో ఇంటింటికి ప్రచారం చేశారు.ప్రధానిగా నరేంద్ర మోడీ 3వ సారి అధికారంలోకి రావడానికి ఈవీఎం యందు 4 వ నెంబర్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి శానంపూడి సైదిరెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

భూత్ అధ్యక్షులు కార్యకర్తలు వేణు, హేమంత్,దేవ,నిఖిల్,మధు,రాజు, లక్ష్మణ్,శ్రీను,ధన్రాజ్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.